Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మా సహనాన్ని పరీక్షిస్తున్నారు : లోకేష్‌

ఏపీ డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్‌ లీగల్‌ అయ్యాయని, ఇదంతా నిలదీసినందుకు దాడులకు పంపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ధైర్యం ఉంటే నేరుగా రావాలని.. పెంపుడు కుక్కలను పంపుతారా అంటూ లోకేష్‌ పేర్కొన్నారు. అవసరమైతే టైం, ప్లేస్‌ చెప్పాలని తామే ధైర్యంగా వస్తామని లోకేష్‌ సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. దాడులకు భయపడమని లోకేష్‌ పేర్కొన్నారు. ప్రశ్నించే వారిని ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఎమర్జెన్సీ విధించాలని కోరారు. డీజీపీ, వైసీపీ నేతలు ప్రెస్‌ మీట్‌ పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.ఇది పార్టీ ఆఫీస్‌ కాదని.. ఒక దేవాలయమని.. అలాంటి ఆలయంపై దాడి చేశారంటూ పేర్కొన్నారు. మా ఓర్పు, సహనాన్ని పరీక్షిస్తున్నాంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img