Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ముందస్తు ఎన్నికలకు వెళదాం : అచ్చెన్నాయుడు

టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికార వైస్సార్సీపీ నేతలు చేసిన ఛాలెంజ్‌ పై స్పందించారు. అధికార పార్టీ చేసిన ఛాలెంజ్‌ లో భాగంగా ముందస్తు ఎన్నికల కు వెళదామని చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఎపుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇంకా వ్యతిరేకత పెరిగితే నష్టం జరుగుతుందని.. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా తోందర్లోనే ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నారు..తాము కూడా అదే భావిస్తున్నామని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లినా.. టీడీపీకి ఏపీ ప్రజలు పట్టంకడతారని.. 160 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాము ఈ విషయం గుడ్డిగా చెప్పడం లేదని.. రాష్ట్రంలో ఆ పరిస్థితులు అలా ఉన్నాయని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img