బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ముగిసింది. చివరిరోజు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్గార్గ్ తెలిపారు. ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఇద్దరు ఎన్నికల పరిశీలకులు జిల్లాకు చేరుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఇందులో ఎన్నిక వ్యయ పరిశీలకులుగా షీల్ ఆసిస్ (ఐఆర్ఎస్), పోలీసు పరిశీలకులుగా పి.విజయన్ (ఐపీఎస్) వ్యవహరిస్తారని వివరించారు.