Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ముగిసిన వైసీపీ కాపు నేతల సమావేశం..

రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల ఏర్పాటు చేసిని సమావేశం ముగిసింది. గత ప్రభుత్వంలో, ఇప్పుడు కాపులకు జరిగిన లబ్ధిపై చర్చించారు. కాపు నేతలపై పవన్‌ వ్యాఖ్యలను సమావేశం తీవ్రంగా ఖండిరచింది. త్వరలో విజయవాడలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాపులపై పవన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖడిస్తున్నామన్నారు. త్వరలోనే సీఎం జగన్‌ను కలిసి వివరిస్తామన్నారు. చంద్రబాబు కన్నా జగన్‌ లక్ష రెట్లు కాపులకు మేలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా సీఎం చేయడానికే పవన్‌ పని చేస్తున్నారన్నారు. రంగా హత్యకేసు వెనుక చంద్రబాబు ఉన్నారని, హరిరామ జోగయ్య చాలాసార్లు చెప్పారని వారు మండిపడ్డారు. పవన్‌ది సెలబ్రిటీ పార్టీ, సిద్ధాంతం లేని పార్టీ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అది నిలబడే పార్టీ కాదు.. ఎవరికో తాకట్టు పెట్టడానికే పవన్‌ ప్రతయ్నం చేస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img