Friday, April 19, 2024
Friday, April 19, 2024

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం..సుప్రీంకు వెళ్తాం


ఏపీ హోంమంత్రి సుచరిత
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా పార్లమెంట్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని… అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు.రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. రాజధాని ఎక్కడుండాలన్న అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం చెప్పిందని గుర్తుచేశారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని కోర్టు చెప్పినట్లు తెలిపారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందన్నారు. మొత్తం తరలిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని… రాజధానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img