Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మూడు రోజుల్లో..మూడు అమానవీయ ఘటనలు : లోకేష్‌

మూడు రోజుల్లో ఆడపిల్లలపై మూడు అమానవీయ ఘటనలు జరిగినా ప్రభుత్వంలో స్పందనలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ విమర్శలు గుప్పించారు. మొన్న రమ్య..నిన్న రాజుపాలెంలో చిన్నారి.. నేడు విజయనగరం జిల్లా చౌడవాడలో యువతిపై .. ఇలా మూడు రోజుల్లో ఆడపిల్లలపై మూడు అమానవీయ ఘటనలు జరిగాయన్నారు. నిందితుల్ని పట్టుకుని శిక్షించడంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తే రోజుకొకడు ఇలా మృగంలా ప్రవర్తించడని అన్నారు. క్రిమినల్స్‌ చెలరేగిపోతున్నారన్నారని, దయచేసి దృష్టిసారించండని కోరారు. ఆడపిల్లల ఉసురు తగిలితే తమకూ, ఈ రాష్ట్రానికీ మంచిది కాదని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img