ఏపీలో మెరుగైన పోలీపింగ్తో నేరాల తగ్గించగలిగామని ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. విజబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, మహిళా పోలీసు సేవల సమర్థవంత నిర్వహణ, పీడి యాక్ట్ ప్రయోగం, నాటు సారా ఫై ఉక్కుపాదం మోపడం తదితర చర్యల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. గతేడాది 2,84,753 కేసులు నమోదు కాగా, 2022లో 2,31,359 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2021 లో 945 హత్య కేసులు నమోదు కాగా, 2022లో 857 హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. చోరీల్లో నేరస్తులను గుర్తించడం, రికవరీ శాతం బాగా పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు 2021లో 19203 జరుగగా.. 2022లో 18739 ప్రమాదాలు జరిగాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా 1,08,763 కేసులు పరిష్కారం చేశామన్నారు. 66% కేసుల్లో కన్నిన్షన్ చేయించగలిగాం అన్నారు. కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని ఈ సంవత్సరం జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని అన్నారు.