చంద్రబాబుకు పెద్దిరెడ్డి కౌంటర్
రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ చేస్తున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండిరచారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని నిర్మూలించామని ఇప్పుడు ఎలాంటి అవకతవకలు జరగకుండా మైనింగ్ జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో పెంచి పోషించిన మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తూ, తమ ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టిందన్నారు. అందుకే మైనింగ్ శాఖకు దేశంలోనే మూడవ బెస్ట్ ర్యాంకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో కొండల్ని, చెరువులను తవ్వేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం విడ్డూరమని ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని పెద్దిరెడ్డి తెలిపారు.