ఫామ్హౌస్లు, ప్యాలెస్లు రాజధానులవుతాయా?
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
విశాలాంధ్ర`ఒంగోలు : మోదీ సర్కారు అవలంబిస్తున్న విదేశాంగవిధానం మరింత ప్రమాదకరంగా మారనున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ విమర్శించారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఈనెల 22 నుండి 26 వరకు నిర్వహించనున్న విద్యార్థి, యువజన వర్క్షాప్ కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు బుధవారం ఆయన ఒంగోలు విచ్చేశారు. మల్ల య్యలింగం భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ 20 ఏళ్లుగా అఫ్గానిస్థాన్లో మినరల్స్, డ్రైఫ్రూట్స్ను అమె రికా దోచుకుందన్నారు. దానికి భారత్ మద్దతు పలికిందన్నారు. ఇప్పుడు తాలిబన్ల దెబ్బకు అమెరికా తన సైన్యాన్ని వెనక్కి తీసుకుందన్నారు. మరోవైపు తాలిబన్లకు భారత్ లక్ష్యంగా మారిం దన్నారు. అమెరికా మెప్పు కోసం ఇజ్రాయిల్తో కుదుర్చుకున్న ఒప్పందం రాజ్యాం గంలోని 21వ అధికరణ కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రమాదం వాటిల్లిందన్నారు. నిఘా ఒప్పందం ద్వారా రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు టాపింగ్ చేశారన్నారు. చివరకు కేంద్రమంత్రుల ఫోన్లు కూడా టాపింగ్కు గురయ్యాయన్నారు. దీని ద్వారా మోదీ ప్రభుత్వం రాజద్రోహానికి పాల్పడిరదని ధ్వజమెత్తారు. ఉరితాళ్లుగా మారిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అన్న దాతలు ఆందోళనలు చేస్తుంటే కేంద్రం పట్టించు కోవడం లేదన్నారు. రూ.6.30లక్షల కోట్ల సమీకరణ కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు తెగనమ్ముతున్నారన్నారు. రూ.2లక్షల కోట్ల ఆస్తులు ఉన్న విశాఖ ఉక్కును కేవలం రూ.52వేల కోట్లకు అప్పగిస్తున్నారన్నారు. రూ.9వేల కోట్ల గంగవరం పోర్టును రూ.3వేల కోట్లకు అమ్ముతున్నారన్నారు. దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు అప్పగించటమే మోదీ ప్రభుత్వం లక్ష్యమని విమర్శించారు. ప్రజాస్వా మ్యాన్ని, లౌకికవాదాన్ని, రాజ్యాంగ వ్యవస్థ ధ్వంసమే లక్ష్యంగా మోదీ పాలన సాగిస్తున్నా రన్నారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై ఈనెల 20 నుండి 30 వరకు సీపీఐ జాతీయ స్థాయిలో ప్రచారాందోళనలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో జల వివాదానికి కారణం తెలంగాణ లో షర్మిల రాజకీయ పార్టీ పెట్టటమేనన్నారు. ఆమెను నిలువరించటంలో జగన్ విఫలమైన కారణంగానే కేసీఆర్ జలవివాదం సృష్టించి బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు రాజకీయాలు పక్కన పెట్టి చర్చించు కోవటం ద్వారా సమస్యకు తెరపడు తుందన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంటూ రాష్ట్రమంత్రి గౌతంరెడ్డి పేర్కొనటం హేయమన్నారు. కేసీఆర్ ఫాంహోస్ లో, జగన్ ప్యాలెస్లో ఉండి పాలన సాగించినంత మాత్రాన అవే రాజధానులు అవుతాయా అని ప్రశ్నిం చారు. జగన్ ప్రభుత్వం పట్టపగలే ఇసుక రూపంలో ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న దన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టులకు నీరు ఎలా వస్తుందో జగన్ చెప్పాలన్నారు. జగన్ పాలన కొన్ని పథకాలకే పరిమితమైందన్నారు. సమావేశంలో సీపీఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి ఎం.వెంకయ్య పాల్గొన్నారు.