Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

యువతిపై పెట్రోలు దాడి ఘటన దురదృష్టకరం

విజయనగరం జిల్లాలో పూసపాటిరేగ మండలం చౌడవాడ గ్రామంలో పెట్రోలు దాడిలో గాయపడిన బాధితురాలిని
ఏపీ మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ పరామర్శించారు.ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, యువతిపై పెట్రోలు దాడి ఘటన దురదృష్టకరమన్నారు. దిశా యాప్‌ ద్వారా పోలీసులు బాధితురాలిని రక్షించారని వెల్లడిరచారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. కాగా హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్ట్‌ చేశామని ఎస్పీ దీపికా పాటిల్‌ తెలిపారు. ఈ ఘటనపై సీఎం జగన్‌ ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించాలని సీఎం ఆదేశించారు. నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని చెప్పారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని జగన్‌కు అధికారులు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img