సీఎం సొంత జిల్లాలోని యూనివర్శిటీలో`విద్యార్ధి సంఘాల ఫైర్
ఏపీలో మహనీయుల పేరుమార్పులు, విగ్రహాల తొలగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై వివాదం కొనసాగుతుండగా.. ఇప్పుడు తాజాగా కడపలోని యోగి వేమన యూనివర్శిటీలో ఏకంగా వేమన విగ్రహాన్నే తొలగించి మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టడం కలకలం రేపుతోంది. దీనిపై విద్యార్ధి సంఘాలతో పాటు విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. యోగి వేమన స్ధానంలో వైఎస్సార్ కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్శిటీలో ఉన్న యోగి వేమన విగ్రహం స్ధానంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తాజాగా ప్రతిష్టించారు. యూనివర్శిటీ యోగి వేమన పేరుతో ఉంటే ఆయన విగ్రహాన్ని తొలగించి వర్శిటీ అధికారులు వైఎస్ విగ్రహాన్ని చడీ చప్పుడు కాకుండా పెట్టేశారు. విషయం తెలుసుకున్న విద్యార్ధులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్ధి సంఘాలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నాయి.