రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కేబీఎన్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేటి యువత సమాజం పట్ల సేవాభావనాతో ఉండటం మంచి విషయమని, ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణం నిలుపుతుందన్నారు. 5 వందల మందికిపైగా రక్తదానం చెయ్యటం గొప్ప విషయమన్నారు. కోవిడ్ సమయంలో రక్త నిల్వలు తగ్గిపోయాయని అన్నారు. రక్తం ఇవ్వటంతో పాటు అవయవదానం చెయ్యాలని పిలుపునిచ్చారు.