మెగా బ్రదర్ నాగబాబు సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశాలపై కూడా ఆయన ఈ వేదిక మీదనే స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఓ పోస్టు చేశారు. ‘భారతదేశ తదుపరి రాష్ట్రపతిగా నేను ప్రపోజ్ చేసే వ్యక్తి రతన్టాటా గారు.. మీరేమంటారు’ అని దేశ రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ప్రస్తుతం దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని, దేశ పరిస్థితులు రోజు రోజుకు దిగుజారుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తదుపరి రాష్ట్రపతి రాజకీయ ఎత్తుగడలను వ్యూహాలను రచించే వ్యక్తి కాకుండా.. దేశాన్ని తన కుటుంబంలా భావించి ప్రేమించే వ్యక్తి అయితే బాగుంటుందని పేర్కొన్నారు. తాను రతన్టాటాను పేరును ప్రతిపాదిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.