ఏపీలో అభివృద్ధి దిగజారిపోయిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. హైదరాబాద్లో జనసేన కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధిని అడ్డుకునేవారు ఎవరైనాసరే తనకు బద్ధ శత్రువులేనని అన్నారు. ‘ఏదైనా సరే అడుగుపెడితే తప్ప అనుభవం రాదు. గెలుస్తామా.. ఓడుతామా నాకు తెలియదు. నేను రాజకీయాల్లోకి వస్తుంటే భయపెట్టారు.’ అని చెప్పారు. రాజకీయాల్లో మత ప్రస్తావన ఉండకూడదని అన్నారు. కులాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని అన్నారు. బలమైన సామాజిక మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.