ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో కేంద్రప్రభుత్వం బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టింది. అమరావతినే ఏపీ రాజధానిగా పేర్కొంటూ 2022-23 బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ప్రకటించింది. కేంద్ర బడ్జెట్లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి నిధులను కేటాయించారు. సచివాలయ నిర్మాణానికి రూ.1214 కోట్లను అంచనా వ్యయంగా కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల కోసం రూ. 1126 కోట్లను కేంద్రం అంచనా వేసింది. ఈ బడ్జెట్లో రూ. లక్షల రూపాయలను పట్టణాభివృద్ది శాఖ కేటాయించింది. జీపీఓఏ కి భూసేకరణ కోసం రూ. 6.69 కోట్ల అంచనా వ్యయంగా పేర్కొంది. 2020-21, 2021-22 బడ్జెట్లలో మొత్తం రూ. 4.48 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. ఉద్యోగుల నివాస గృహాలకు అవసరమైన భూ సేకరణకు 2021-22లో రూ. 21 కోట్లు అంచనా వేసి ఇప్పటి వరకు రూ.18.3 కోట్లను కేంద్రం ఖర్చు చేసింది.