ఎంపీ రఘురామకృష్ణరాజు
రాజధాని అమరావతిని మార్చడం ఎవరి వల్లా కాదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో ఆయన మాట్లాడారు. ఏపీకి రాజధాని లేని పరిస్థితిని కల్పించారని దుయ్యబట్టారు. రాజధాని కోసం అమరావతి రైతుల త్యాగం మరువలేనిదని కొనియాడారు. అమరావతే ఏపీకి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. రాజధాని రైతులు ధైర్యంగా పోరాడాలని, అంతిమ విజయం రాజధాని రైతులదే అవుతుందని పేర్కొన్నారు. పాదయాత్ర చేసిన మహిళల త్యాగానికి ఏదీ సాటి రాదన్నారు. కొంతకాలం ఓపిక పడితే అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు నేతలు హాజరయ్యారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు.