Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

రాత్రి 11గంటల కల్ల అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలి : ఎస్పీ సిద్ధార్థ్‌

కరోనా కొత్త వేరియంట్‌ శరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కొత్త సంవత్సర వేడుకలకు నిబంధనలతో కూడిన ఆంక్షలు విధించామని ఎస్పీ సిద్ధార్థ కౌశిల్‌ తెలిపారు.రాత్రి 11గంటల కల్ల అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు పూర్తిగా నిషిద్ధం విధించినట్లు చెప్పారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టామని, చెప్పారు. మరోవైపు పోలీసులు చేపట్టిన చర్యలు కారణంగానే మహిళలు ఫిర్యాదులు చేయడానికి ముందుకు వచ్చారన్నారు. అందువల్లే మహిళాల కేసులు ఎక్కువ నమోదయ్యాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళల రక్షణ, భద్రతకే తమ ప్రధమ ప్రాధాన్యత అని సిద్ధార్థ్‌ కౌశిల్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img