Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్రంలో కొత్తగా 1,145 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,145 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరిలో 216, నెల్లూరు జిల్లాలో 173 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇక,గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌ బారి నుంచి 1,090మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకుకున్నవారి సంఖ్య 19,99,651కు చేరుకుంది. మహమ్మారి బారిన పడి గడిచిన 24గంటల్లో కరోనాతో 17 మృతి ప్రాణాలను కోల్పోయారు. చితూరు జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 15,157యాక్టివ్‌ కేసులున్నట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img