Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రాష్ట్రంలో కొత్తగా 1,439 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,439 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారిబారిన పడి 14 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,311 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,97,454 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 13,964కు చేరింది.ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం రోజున హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img