Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

రాష్ట్రంలో కొత్తగా 1,502 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 63,717 శాంపిల్స్‌ పరీక్షించగా 1,502 మందికి వైరస్‌ సోకినట్లు నిర్థారణయ్యింది.తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2019702కి చేరింది. మహమ్మారి బారినపడి కొత్తగా 16 మంది ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13903కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,525మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1990916కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14883 యాక్టివ్‌ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,68,09,774 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img