ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56,463 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 809పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 10 మంది మృతిచెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,51,133 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 14186కు చేరింది. నిన్న 1,160 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 11,142 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 2,83,50,167 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.