రాష్ట్రంలోని పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులు వాటి ప్రగతిని ప్రాజెక్టుల వారీగా సీఎస్ సమీక్షించారు. కోటిపల్లి-నర్సాపురం, నడికుడి-శ్రీకాళహస్తి, గుంతకల్లు-గుంటూరు, కడప-బెంగుళూర్ రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై, అలాగే నిడదవోలు-భీమవరం, భీమవరం-విజయవాడ రైల్వే లైను డబ్లింగ్ మరియు విద్యుదీకరణ పనులపైనా, పలు రైల్వే ఓవర్ బ్రిడ్జి లు (ఆర్ఓబి)లో నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు.