మోదీకి, వ్యవసాయ మంత్రికి విడివిడిగా లోకేశ్ లేఖలు
రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలే ఎరువులు, డీఏపీ కొరత సృష్టిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ రంగ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లకు లేఖలు రాశారు.ఎరువులను, డీఏపీని ఆదాయపు వనరుగా మార్చుకునేందుకు పంపిణీ విధానాన్ని మార్చివేశారని, సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయాల్సిన ఎరువులను వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు తరలించిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సహకార సంఘాలకు కోత విధించి, రైతు భరోసా కేంద్రాలకు మళ్లించామని చెబుతున్నారని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2.25 లక్షల టన్నుల డీఏపీని కేటాయించినా ప్రయోజనం లేకుండా పోయిందని, బ్లాక్ మార్కెటింగ్, రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో కృత్రిమ కొరత ఏర్పడిరదని నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తద్వారా ఓపెన్ మార్కెట్లో 50 కిలోల డీఏపీ బస్తాకు అదనంగా రూ.300 చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. ఏపీలో పరిస్థితులను అర్థం చేసుకుని తక్షణమే డీఏపీ సరఫరా పెంచాలని లోకేశ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎరువులకు, డీఏపీకి కృత్రిమ కొరత ఏర్పడడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.