ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఆగ్నేయ బంగాళాఖాతం నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు నిన్న ‘ఉపరితల ద్రోణి’ ఏర్పడిరది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.