Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్రానికి టూరిస్ట్‌గా వచ్చే పవన్‌కు ఇవన్నీ ఏం తెలుస్తాయి

మంత్రి అవంతి శ్రీనివాస్‌
పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్‌ అన్న సంగతి అందరికీ తెలుసని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రానికి ఏం సాధించాగలిగావో ప్రజలకు చెప్పాలని ్‌ పవన్‌ కల్యాణ్‌ను డిమాండ్‌ చేశారు.అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. కుల, మతాలతో సంబంధం లేకుండా లక్షా ముప్పై వేల కోట్లు పేదల అకౌంట్‌లో వేశామని తెలిపారు. ఎక్కడైనా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి టూరిస్ట్‌గా వచ్చే పవన్‌కు ఇవన్నీ ఏం తెలుస్తాయని ఎద్దేవా చేశారు. అమరావతిని తీసేస్తామని సీఎం జగన్‌ ఎప్పుడూ చెప్పలేదని, అమరావతితోపాటు ఇతర ప్రాంతాల అభివృద్ధి గురించి కూడా చెప్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారని నిలదీశారు.‘అభివృద్ధి వికేంద్రీకరణ చేయటం తప్పా. జిల్లాల వికేంద్రీకరణ కూడా అభివృద్ధి కోసమే. వైఎస్సార్‌సీపీని ఎందుకు గద్దె దించాలి? అవినీతి లేకుండా పాలన చేస్తున్నందుకా? 2008లో మన ఇద్దరిప్రస్థానం ఒకేసారి మొదలయింది. నేను మూడు సార్లు గెలిచి మంత్రి పదవి దాకా వచ్చానంటే నాలో మంచి క్వాలిటీ ఉన్నందునే. మరి నువ్వు ఎందుకు గెలవలేకపోయావ్‌? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. ప్రజా రాజ్యం నుంచి మేమంతా ఎందుకు బయటకి వచ్చామో తెలుసుకో. వైఎస్‌ జగన్‌కు 151 సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారో తెలుసుకో. అన్ని పార్టీలను కలపటానికి నువ్వు ఎవరు? కొన్ని లక్షల మంది జీవితాలతో ఆటలాడుకోవద్దు. టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్‌ని సీఎం చేస్తారా? నిన్ను చేస్తారా? జనసేన కార్యకర్తలు బాగా ఆలోచించుకోవాలి. సోషల్‌ ఇంజనీరింగ్‌ గురించి పవన్‌ మాట్లాడుతున్నారు. అన్ని వర్గాల వారికి పదవులు ఇవ్వటం సోషల్‌ ఇంజనీరింగ్‌గా కనపడటం లేదా? ఎమర్జెన్సీతో ఇప్పటి పరిస్థితుల గురించి మాట్లాడటంలోనే పవన్‌ పరిణితి లేని రాజకీయ నేత అని అర్థం అవుతుంది.’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img