ఏపీని క్రీడా ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా ప్రకటించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ క్రీడల్లో సరైన ప్రోత్సాహం లేకపోవడంతో వెనుకబడిపోతున్నారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ క్లబ్ అభివృద్ధి చేస్తామన్నారు. స్పోర్ట్స్ ఆడడం వల్ల మానసిక స్థైర్యం వస్తుందని రోజా తెలిపారు. ఇటీవల పర్యటన, సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా రోజా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.