Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి : మంత్రి బొత్స

ఉద్యోగులను చర్చలకు పిలిచినా పీఆర్‌సీ సాధన కమిటీ వాళ్లు చర్చలకు రాకపోవడం బాధాకరమని, జీతాలు పడితే కదా.. పెరిగేది, తగ్గేది తెలిసేదని, ఎవరికీ కూడా రూపాయి కూడా తగ్గదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల కమిటీ శుక్రవారం మరోసారి సమావేశానికి ఆహ్వానించింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ వేశామని, వారిలో అపోహలు తొలగించేందకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఉద్యోగులతో చర్చలకు తాము అందుబాటులో ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణం మంచిది కాదని, వాళ్ళు ఎప్పుడు చర్చకు వస్తామంటే అప్పుడే చర్చిస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img