రాష్ట్ర పోలీసు వ్యవస్థ ‘సవాంగ్ మార్క్’ పోలీసింగ్ నుంచి బయటపడాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విటర్ వేదికగా సూచించారు. ప్రశ్నించే వారిపై 153 (ఏ) ఐపీసీ కేసులు పెట్టడం మానాలి. ఇటీవల సుప్రీంకోర్టు 153(ఏ) పై విశ్లేషించిన విధానాన్ని పొలీసు శాఖ ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. ‘ఇటీవల సుప్రీంకోర్టు 153(ఏ) పై విశ్లేషించిన విధానాన్ని పొలీసు శాఖ ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా పొలీసులు వ్యవహరించకూడదు.. నిష్పాక్షికంగా ఉండాలి’ అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.