Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రాష్ట్ర సర్కారుకి యువత బుద్ధి చెప్పే రోజులు వస్తాయి : లోకేశ్‌

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. . ‘భారతీయ యువతరంలో చైతన్యం నింపడానికి, ఆత్మ విశ్వాసం కలిగించడానికి తన జీవితమంతా కృషి చేసిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, తెలుగు యువతకు శుభాకాంక్షలు’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ‘యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వానికి యువతరమే బుద్ధి చెప్పే రోజు త్వరలో రానుంది. అప్పుడు నిజమైన యువజనోత్సవాలను ఘనంగా చేసుకుందాం. అప్పటివరకు మార్పు కోసం కృషి చేద్దాం’ అని చెప్పారు.జాబ్‌ కాలెండర్‌ రాదు. పరిశ్రమలు రావు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావు. స్వయం ఉపాధి రుణాలు మంజూరు కావు. విదేశీ విద్యకు సాయం లేదు’ అని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img