కొత్తగా 2,591 పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,204 సాంపిల్స్ని పరీక్షించగా.. 2,592 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 511 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.తాజాగా 3,329 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,87,670 మంది బాధితులు కోలుకున్నారు. కరోనాతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,957 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక వైరల్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 13,057 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేట్ 2.8 శాతం ఉండగా, రికవరీ రేటు 98 శాతం ఉంది. అలాగే కోవిడ్ మరణాల శాతం 0.68 గా ఉంది. తాజాగా నమోదైన కేసుల్లో జిల్లాల వారీ వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురంలో 69, చిత్తూరులో 349, తూర్పు గోదావరిలో 511, గుంటూరులో 219, కడపలో 217, కృష్ణాలో190, కర్నూలులో 29, నెల్లూరులో 162, ప్రకాశంలో 251, శ్రీకాకుళంలో 62, విశాఖపట్నంలో 220, విజయనగరంలో 46, పశ్చిమ గోదావరిలో 266 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక మరణాల వివరాలు జిల్లాల వారీగా.. చిత్తూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.