విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ… రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లక్ష్మీనారాయణ ఏ2గా ఉన్నారు. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో విచారణకు వెళ్లలేకపోయారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయగా విచారించింది. ఆయనకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. మరోవైపు రెండు రోజుల క్రితం ఆయన ఇంట్లో సోదాలు చేపట్టిన సీఐడీ అధికారులు, ఈరోజు విచారణకు హాజరుకావాలని లక్ష్మీనారాయణకు నోటీసులు ఇచ్చారు.