ఏపీలోని విశాఖ జిల్లాలో గల రుషికొండ తవ్వకాలపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పై తీవ్రంగా మండిపడిరది. ఈ మేరకు అభ్యంతరాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం రేపు ఉదయం తిరిగి విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.