Friday, April 19, 2024
Friday, April 19, 2024

రెండున్నరేళ్లలో అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయం : కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయం సాధించిందని గుర్తు చేశారు.కోర్టు జడ్జిమెంట్‌ రాగానే ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని.. ఆ 21 మున్సిపాల్టీల్లో ప్రజల తీర్పేంటో చంద్రబాబు చూస్తారన్నారు. వైఎస్‌ జగన్‌ చిన్న వయసులో ఉన్నత స్థానానికి వచ్చారన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబుకు లేదని.. మానసిక స్పృహ కోల్పోయి చంద్రబాబు పిచ్చి వాగుడు వాగుతున్నారని అన్నారు. ఏపీ ప్రజలు శిక్ష విధించినా చంద్రబాబుకు సిగ్గురావడం లేదంటూ విరుచుకుపడ్డారు. మహిళా దినోత్సవాన్ని కూడా రాజకీయ సభలా విమర్శించడం దారుణమని.. ముఖ్యమంత్రి స్థానంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. అందుకే సంబంధం లేని అంశాలన్నింటినీ రుద్ధాలని చూస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌, వంగవీటి రంగా వంటి వారిని ఒక ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు మంత్రి. ఎన్టీఆర్‌ కేవలం నిమ్మకూరుకు మాత్రమే చెందిన వ్యక్తి కాదని.. విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారని గుర్తు చేశారు. అన్ని రకాల సౌలభ్యాలున్న విజయవాడకు ఎన్టీఆర్‌ పేరు పెడితే తప్పేంటని.. విజయవాడ ఏమైనా పక్క దేశంలో ఉందా అంటూ విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img