రెండున్నరేళ్లలో రాష్ట్ర ప్రజలకు వైసీపీ చేసిందేమీ లేదని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. విజయవాడలో సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజాగ్రహ సభతో వైసీపీకి భయం పట్టుకుందన్నారు. పేర్ని నాని, పయ్యావుల వ్యాఖ్యలు ఆ భయం నుంచి వచ్చినవే అని అన్నారు. వైసీపీ పాలనలో ఏపీ చాలా నష్టపోయిందన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఉద్యోగులు బాధపడుతున్నారని అన్నారు. ప్రజాగ్రహ సభ ఆరంభం మాత్రమేనని చెప్పారు. రాజధానిగా అమరావతే కొనసాగుతుందన్నారు. ఈ విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నానని అన్నారు.