పవన్కళ్యాణ్
పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల మేరకు 177 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలను జనసేన అభ్యర్ధులు గెలిచారని పేర్కొన్నారు. పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులందరూ బలమైన పోరాటం చేశారని అన్నారు. ఈ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయన్న అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ఫలితాలపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని తెలిపారు.