సచివాలయంలో రెండో రోజు ఆర్థికశాఖ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగి ర్యాలీ చేశృారు. ఆర్థికశాఖ ఉద్యోగుల సీనియార్టీని ఫైనల్ చేయకపోవడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గతేడాది ఆగస్టులో ఆర్థిక శాఖ ఉద్యోగుల సీనియార్టీ ఫైనల్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలు అమలుకాకపోవడంతో ఆర్థిక శాఖ ఉద్యోగుల ఆందోళనకు దిగారు.