ట్వీట్ చేసిన ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిరచింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు తదితర ఆరు జిల్లాల్లో భారీగా వానలు కురుస్తాయని అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మిగతా చోట్ల అక్కడక్కడా స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని వెల్లడిరచింది. ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ శుక్రవారం ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.