12న విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు తెలిపారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన అధినేత విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో రేపు(ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ కళ్యాణ్ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం కలిసి వస్తే అందరం కలసి పోరాటం చేద్దామన్నా స్పందన లేదన్నారు.దీంతో నిరహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. రేపు మంగళగిరి పార్టీ ఆఫీస్లో జరిగే దీక్షలో భవిష్యత్తు కార్యచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. గుంటూరుకు చెందిన అమృతరావు స్టీల్ ప్లాంట్ కోసం నిరహార దీక్ష చేశారని గుర్తుచేశారు. అందుకే గుంటూరు జిల్లా నుంచే జనసేన స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం ప్రారంభిస్తోందని గాదె వెంకటేశ్వరరావు వెల్లడిరచారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలాగా మారాయని వ్యాఖ్యానించారు. ఓటీఎస్ పేరుతో స్టాంప్ పేపర్లపై జగన్ ఫోటో వేయడం నేరమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ ప్రభుత్వానికి చలనం లేదని మండిపడ్డారు. దీక్షలో పవన్తో పాటుగా నాదెండ్ల మనోహర్.. పీఏసీ సభ్యులు.. పార్టీ జిల్లాల నేతలు సైతం పాల్గొంటారు