: ఏపీలో పదో తరగతి ఫలితాలపై స్పష్టత వచ్చింది. జూన్ రెండో వారంలో విడుదల అవుతాయనుకున్న టెన్త్ రిజల్ట్స్ వారం ముందుగానే రిలీజ్ కానున్నాయి. జూన్ 4న (శనివారం) ఉదయం 11 గంటలకు ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ గురువారం వెల్లడిరచింది. ప్రస్తుత విధానానికి భిన్నంగా ఈసారి టెన్త్ ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటించనున్నట్లు వెల్లడిరచారు. ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడకూడదని, ర్యాంకులను నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఏపీ టెన్త్ విద్యార్థుల బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ విజయవాడలో విడుదల చేయనున్నారు. కొవిడ్ వ్యాప్తి కారణంగా రెండేళ్లు (2019 తర్వాత ) పరీక్షలు జరగలేదు. రెండేళ్ల తరువాత టెన్త్ పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 6,21,799 మంది విద్యార్థులు ఎగ్జామ్స్కు హాజరయ్యారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని, ఈ సారి ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తమ సూచనలు పాటించకుండా ఏవైనా విద్యా సంస్థలు, స్కూళ్లు కనుక ర్యాంకులు ప్రకటిస్తే వారు చట్టరీత్యా శిక్షార్హులని హెచ్చరించారు.