Friday, April 19, 2024
Friday, April 19, 2024

రైతులకు నష్టం జరిగితే తక్షణమే స్పందిస్తాం


: మంత్రి కన్నబాబు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసిముద్దవుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జులై 22 వరకు 200.3 మి.మీ. వర్షపాతం ఉండాల్సి ఉంటే 256 మి..మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం, చిత్తూరు, కడపలో వర్షాలు పడ్డాయని.. 55 మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో పొలాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. రైతులకు నష్టం జరిగితే తక్షణమే స్పందిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img