చంద్రబాబునాయుడు
రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్షకులకు చంద్రబాబు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రుణాలు, విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉందని, కనీస మద్దతు ధర లేక వ్యవసాయం సంక్షోభంలో ఉందన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండు చేశారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు రుణభారంతో ఉన్నారని తెలిపారు. వరి వేయవద్దని చెప్పడం రైతులను అవమానించడమేనని అన్నారు.