Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రైతు పాదయాత్రకు దర్శకుడు, నిర్మాత అన్నీ చంద్రబాబే

మంత్రి గుమ్మనూరు జయరాం
రైతు పాదయాత్రకు దర్శకుడు, నిర్మాత అన్నీ చంద్రబాబేనని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లాలో ఆయన మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం అవుతుందని అన్నారు.చంద్రబాబు చేయిస్తున్న పాదయాత్ర.. న్యాయస్థానం టూ దేవస్థానం కాదు ‘అన్యాయం టూ అన్యాయం మోసం టూ మోసం’ అని టైటిల్‌ పెడితే బాగుంటుందన్నారు. పాదయాత్రకు ఆదరణ కరువయ్యిందన్నారు. అది రైతు పాదయాత్ర కాదు శ్రీమంతుల యాత్ర అని అన్నారు. పాదయాత్ర వల్ల ప్రజలకు ఏమీ ఒరగదని, ప్రజలకు న్యాయం చేయాలంటే సీఎం జగన్‌కే సాధ్యమని అన్నారు.ాయలసీమ అంటే చంద్రబాబుకు కక్ష. న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు న్యాయం చేస్తుంటే చంద్రబాబుకు ఓర్చుకోలేకపోతున్నాడని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img