Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైల్వే జోన్‌ను త్వరలోనే ఏర్పాటుచేస్తాం

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు
రైల్వే జోన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మరే ఇతర జోన్‌ ఇచ్చే ఉద్దేశం రైల్వేకు లేకపోయినా ప్రధాని మోదీ ఏపీకు రైల్వే జోన్‌ ఇస్తున్నారన్నారు. . కేంద్రం ఇచ్చే పథకాలకు రాష్ట్రం స్టిక్కర్లు వేసుకుంటోందని అన్నారు. పీఎం అవాస్‌ యోజన కింద నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండు చేశారు. టిడ్కో ఇళ్ళు ఇవ్వకుంటే రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్బికేలు, సచివాలయాలు కేంద్రం ఇచ్చే ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ నిధులతోనే జరుగుతున్నాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందని, రైతుల సమస్యలపై శీతకన్ను వేసిందని అన్నారు. పీఎం ఫసల్‌ భీమా వద్దన్న సీఎం జగనే బాధ్యత తీసుకోవాలన్నారు. వారం రోజుల్లో ప్యాకేజీ ప్రకటించకపోతే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img