ఎంపీ రామ్మోహన్ నాయుడు
దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. 2019 ఫిబ్రవరిలో కేంద్రం హామీ ఇచ్చిన కొత్త జోన్ ఏర్పాటుపై ఇప్పటికీ పురోగతి లేదన్నారు. మూడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2021`2022 బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేవలం రూ. 40 లక్షలు మాత్రమే కేటాయించారని, ఆ డబ్బుతో భవనం నిర్మించడమే కష్టమని అన్నారు. ఇంత తక్కువ కేటాయించడం రాష్ట్రాన్ని అవమానించడమేనని అన్నారు. దేశంలో ప్రస్తుత రైల్వే జోన్ల జాబితాలోగానీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే జోన్ల జాబితాలో గానీ దక్షిణ కోస్తా రైల్వేజోన్ అంశాన్ని చేర్చకపోడంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండు చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు, ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో చెప్పాలిని రాష్ట్ర ప్రజల తరుపున డిమాండు చేస్తున్నామన్నారు. వెంటనే రైల్వే జోన్ను ఏర్పాటుచేయాలన్నారు.