సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం జులై 15 నాటికి రోడ్లు వేయాలంటూ జంగారెడ్డిగూడెంలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన జంగారెడ్డిగూడెం నుంచి మైసన్నగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై శ్రీనివాసపురం గ్రామంలో వరి నాట్లతో ఊడుపు ఊడ్చి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి గత నెల 21వ తేదీన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో చెప్పిన మాట ప్రకారం జులై15 నాటికి రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేసి ఫోటో గ్యాలరీ పెట్టాలని…ఇందుకు మరో రెండు రోజులే మిగిలి ఉందన్నారు. రోడ్ల నిర్మాణం కోసం రూ.2100 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో రోడ్లు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయన్నారు. దీంతో అనేక ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ,ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కడా అభివఅద్ధి, సంక్షేమం లేదని కనీసం శానిటేషన్ కూడా లేని పరిస్థితి ఏర్పడిరదని విమర్శించారు. మాట తప్పి మడమ తిప్పిన ముఖ్యమంత్రి జగన్ తీరు మారకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బబ్బర రాజపాల్, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబయిన రామళింగేశ్వర రావు, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, మండల ప్రధానకార్యదర్శి కుక్కల మాధవరావు, ఎస్సిసెల్ అధ్యక్షుడు గొల్లమందలశ్రీనివాస్, బీసీసెల్ అధ్యక్ష కార్యదర్శులు భూసా సత్యనారాయణ, తదితరులు పాల్గ్గొన్నారు.