పెద్దలు రోశయ్య మరణవార్త తననెంతో బాధించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థికమంత్రిగా, శాసనసభ్యుడిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.