Friday, April 26, 2024
Friday, April 26, 2024

లంక గ్రామాలకు వైఎస్‌ జగన్‌.. రేపు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన

గోదావరి వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన లంక గ్రామాల ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరంలో రేపు జగన్‌ పర్యటన సాగనుంది. గంటి పెదపూడి పంచాయతీ పరిధిలోని బూర్గు లంక, పెదపూడి లంక, ఆరిగలవారిపేట, ఊడిముడి, రాజోలు మండలంలోని ముంపు గ్రామాల్లో సీఎం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులను పరామర్శించి వాళ్లతో జగన్‌ మాట్లాడనున్నారు. అధికార బృందం ఈ మేరకు ఏర్పాట్లు పర్యవేక్షించింది.మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ ఆయా గ్రామాల్లో పర్యటించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల ఈ ముంపు గ్రామాల్లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించిన సంగతి తెలిసిందే. ముంపు గ్రామాల్లో ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా అందించలేదని ప్రతిపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో రేపు సీఎం జగన్‌ పర్యటించడం కొంత ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img