అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయానికి అరుదైన గుర్తింపు దక్కే అవకాశముంది. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. భారత్ నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా అందులో లేపాక్షి ఆలయం ఉండటం గమనార్హం. దీంతో ఏపీ నుంచి తాత్కాలిక జాబితాలో మొదటిసారి స్థానం దక్కినట్లైంది. . మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితాను విడుదల చేస్తుంది. అందులో కనుక లేపాక్షి ఆలయానికి చోటు దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఆలయానికి మంచి గుర్తింపు లభిస్తుంది.