Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

లోకేష్‌ మాట్లాడిన మాటలు, సవాళ్లు..హాస్యాస్పదం : రోజా

చంద్రబాబు, లోకేష్‌ మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ‘‘పంచాయతీ ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తుంగలో తొక్కారు.. మునిసిపల్‌ ఎన్నికల్లో మురుగు కాలువల్లో ముంచి ముంచి తీశారు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టారు.. అయినా వారికి సిగ్గు రాలేదు.’’ అంటూ వ్యాఖ్యానించారు. కుప్పంలో లోకేష్‌ మాట్లాడిన మాటలు, సవాళ్లు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కుప్పంలోనూ చంద్రబాబుకు రాజకీయ సమాధి చేసేందుకే ఇలాంటి సవాళ్లు విసురుతున్నారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కూడా లేదన్నారు. చంద్రబాబు.. ఏనాడు కుప్పం ప్రజలకు అందుబాటులో లేరన్నారు.కోవిడ్‌ సమయంలోను ప్రజలను గాలికొదిలేశారని మండిపడ్డారు. కనీసం తాగునీరు సదుపాయం కూడా అందించలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలనను చేరవేశారని కొనియాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ జగన్‌ రాకపోయినా వైసీపీని గెలిపిస్తున్నారని, ఆయనకు అండగా నిలుస్తున్నారని అన్నారు.నారా లోకేష్‌ రౌడీలాగా మాట్లాడుతున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img