Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్‌ ఫొటో ముద్రించేలా ప్రయత్నాలు : పురందేశ్వరి

శత జయంతి వేళ ఎన్టీఆర్‌ అభిమానులకు పురందేశ్వరి.గుడ్‌ న్యూస్‌ చెప్పారు. వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్‌ ఫొటో ముద్రించేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.ఇవాళ్టి(మే 28) నుంచి వచ్చే ఏడాది మే 28 వరకు అంటే ఏడాది పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారామె. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 12 కేంద్రాలు గుర్తించామని… అక్కడ సెలబ్రేషన్స్‌ ఉంటాయన్నారు. శత జయంతి ఉత్సవాలు చెయ్యడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని పెర్కొన్నారు. ఈ కమిటీలో బాలక్రిష్ణ, రాజేంద్ర ప్రసాద్‌ వంటి ప్రముఖులకు స్థానం కల్పించారు. ఎన్టీఆర్‌ ఫోటోను వంద రూపాయల నాణెంపై ముద్రించేలా అర్‌బీఐతో మాట్లాడుతున్నామని తెలిపారు పురందేశ్వరి. ఈ వేడుకల్లో అన్ని రంగాలలో నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కరం చేస్తామని ప్రకటించారు. శతజయంతి సందర్భంగా పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నివాళి అర్పించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు లీడర్లు. ఆంధ్రప్రదేశ్‌కు, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రజలకు చేసిన మేలును స్మరించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img